స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం `అల వైకుంఠపురములో`. పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. తొలిసారి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణతో కలిసి అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్, బన్నీల కలయికలో ఇప్పటి వరకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి చిత్రాలొచ్చాయి.
ఆ రెండు చిత్రాల తరువాత ముచ్చటగా మూడవసారి బన్నీ, త్రివిక్రమ్ల కలయికలో వస్తున్న చిత్రమిది కావడం, చాలా రోజుల తరువాత టబు కీలక పాత్రలో నటిస్తుండటంతో కామన్గానే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇక తమన్ అందించిన సంగీతం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. ఆయన అందించిన `సామజ వరగమన, కాములో రాములా గీతాలు వైరల్ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. టీజర్లో సముద్రఖనితో అల్లు అర్జున్ చెబుతున్న డైలాగ్లు మాస్ని ఆకట్టుకునేలా వున్నాయి. సంక్రాంతి బరిలో `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో ఈ సినిమా పోటీకి దిగుతోంది.
గురువారం మహేష్ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందడంతో అందరి చూపు `అల వైకుంఠపురములో` పై పడింది. శుక్రవారం అంతా ఎదురుచూసినట్టే `అల వైకుంఠపురములో` సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రానికి కూడా యు/ఎ సర్టిఫికెట్ లభించింది. అయితే ఈ రెండు చిత్రాలకు సంబంధించి మేకర్స్ మాత్రం రిలీజ్ డేట్ని అఫీషియల్గా ప్రకటించకపోవడం ఆసక్తికరంగా మారింది. ముందు ప్రకటించినట్టుగా `సరిలేరు నీకెవ్వరు` జనవరి 11న, `అల వైకుంఠపురములో` జనవరి 12నే వస్తాయా లేక ఆ తేదీలు మారతాయా అన్నది వేచి చూడాల్సిందే.
Censor Done and thus we ensue a Grand Celebration of Sankranthi like Never Before.
We invite you to theaters with your families for all the festival fun!! Don’t miss ???#AVPLSankranthi @alluarjun #Trivikram @hegdepooja @MusicThaman #Tabu #Jayaram pic.twitter.com/yak3urpxTq
— Haarika & Hassine Creations (@haarikahassine) January 3, 2020
Credit: Twitter