ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇప్పుడు ఉస్తాద్ రామ్ పోతినేనిగా మారిన విషయం తెల్సిందే. రామ్ ఇప్పుడు తమిళ స్టార్ దర్శకుడు లింగుసామి తెరకెక్కిస్తోన్న ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కన్ఫర్మ్ అయింది.
ఇక విలన్ గా ఆది పినిశెట్టిని కన్ఫర్మ్ చేసారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ అక్షర గౌడ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదికి పెయిర్ గా అక్షర కనిపిస్తుందిట. అలాగే ఈ చిత్రంలో కడప యాసలో అక్షర మాట్లాడుతుందని సమాచారం.
ఇక రామ్ ఈ చిత్రం కోసం తన లుక్ ను, బాడీని పూర్తిగా మార్చేశాడు. అయితే ప్రస్తుతానికి అది సస్పెన్స్. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తోన్న ఈ సినిమాను 2022 సమ్మర్ కు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే రివీల్ అవుతుంది.