ఉస్తాద్ రామ్ పోతినేని తన నెక్స్ట్ సినిమా విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నాడు. రెడ్ యావరేజ్ తో సరిపెట్టుకోవడంతో రామ్ ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలనుకుంటున్నాడు. తమిళ దర్శకుడు లింగుసామితో కలిసి సినిమా చేస్తున్నాడు రామ్. ఈ చిత్రం తమిళ్, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. దీని షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగం సాగుతోంది.
ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఒక్కొక్క విషయం బయటకు వస్తోంది. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక తాజాగా ఈ చిత్రంలో విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. ఈ విషయాన్ని టీమ్ అధికారికంగా ప్రకటించింది.
ఆది గతంలో సరైనోడు చిత్రంలో విలన్ గా చేసాడు. దానికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మరోసారి విలన్ గా ఏ మేరకు ఇంప్రెస్ చేస్తాడో చూడాలి. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Thank you for having me onboard. Really excited! ✨ https://t.co/UIx7DL87E3
— Aadhi???? (@AadhiOfficial) July 19, 2021