Homeటాప్ స్టోరీస్అకిరా నందన్ ది గంభీరమైన స్వరం అంటున్న శేష్!

అకిరా నందన్ ది గంభీరమైన స్వరం అంటున్న శేష్!

Akhira Nandhan And Adivi Sesh
Akhira Nandhan And Adivi Sesh

ఓ ప్రక్క ‘ఎవరు’ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ.. మరో పక్క ఆ చిత్ర ప్రమోషన్స్లో బిజీగా వున్నా హీరో అడివి శేష్‌ ఆగస్ట్ 26న నటి, ఫిల్మ్‌మేకర్‌ రేణూ దేశాయ్‌ కుటుంబ సభ్యుల్ని మర్యాద పూర్వకంగా కలిశారు.

పవన్ కళ్యాణ్ తో ‘పంజా’ చిత్రంలో శేష్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అప్పటినుండి పవన్ ఫ్యామిలీ తో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు శేష్. పవన్‌ కల్యాణ్‌-రేణు దేశాయ్ ల కుమారుడు అకీరా నందన్‌, కుమార్తె ఆద్యతో కలిసి సరదాగా గడిపారు శేష్.

- Advertisement -

ఈ విషయాన్నీ ఆయన ట్విటర్‌ వేదికగా తెలిపి ఫోటోలను షేర్ చేసారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘హ్యాండ్సమ్‌ కుర్రాడు అకీరాతో ఈ రోజు ఉత్సాహంగా గడిచింది. అతడికి ‘ఎవరు’ సినిమా చాలా నచ్చింది. ఇద్దరం అలా సరదాగా సమయం గడిపాం, భోజనం చేశాం.. జీవితం గురించి సాధారణంగా మాట్లాడుకున్నాం. గంభీరమైన స్వరంతో 6.4 అడుగుల ఎత్తున్న వ్యక్తి అతడు. మా ఇద్దరిదీ ఎడమ చేతి వాటం కావడం సంతోషంగా ఉంది. మా ఇద్దరిలో చాలా విషయాలు కామన్‌గా ఉన్నాయి. చిట్టి ఆద్యకు కెమెరా అంటే కాస్త సిగ్గు. రేణూ దేశాయ్‌తో సంభాషించడం ఆనందంగా ఉంది. మీరు ఓ గొప్ప కవయిత్రి. మమ్మల్ని మీ ఇంటికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు ప్రేమమాలినీ’ అని ఆయన పోస్ట్‌ చేయడం విశేషం.

శేష్‌, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎవరు’ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకట్‌ రాంజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. న‌వీన్ చంద్ర, ముర‌ళీ శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు. పీవీపీ సినిమా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం శేష్‌ ‘మేజర్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ ద్వితీయార్థంలో ప్రారంభంకానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు, బాలీవుడ్ సంస్థ తో కలిసి స్వయంగా నిర్మించడం విశేషం.. !!

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All