నాకు ఇద్దరు ఇష్టమైన వ్యక్తులు ఉన్నారు. ఒకరు అన్నయ్య అయితే.. ఇంకొకరు అమితాబ్ బచ్చన్. వీళ్లిద్దరూ నాకు జీవితంలో బలమైన స్ఫూర్తిప్రదాతలు. అన్నయ్యను చూడటానికి వెళ్లినప్పుడు అమితాబ్ గారిని కలిసే అరుదైన అవకాశం ఈ సినిమా షూటింగ్ లో లభించింది అని పవర్స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా సెట్స్లో పవన్.. బిగ్బిని కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను పవన్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘నా జీవితంలో ఈ క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నా ఆరాధ్యమూర్తి అమితాబ్ బచ్చన్ని ‘సైరా’ సెట్స్లో కలిశాను. ఎన్ని సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని ఆయన జీవితం మనకు నేర్పుతుంది’ అని పేర్కొన్నారు.
దేశం కోసం ఎంతో మంది చనిపోయారు. దేశం గుర్తించని ఉయ్యాలవాడ చరిత్రను కొణిదెల సంస్థ గుర్తించింది. ఇది గర్వకారణం. కొణిదెల నామధేయాన్ని సార్థకం చేసుకున్నారు. నేను ఇందులో నటించలేకపోయాను. కానీ గొంతు వినిపించాను. `సైరా-నరసింహారెడ్డి` అని అనగలిగానంటే నా గుండె లోతుల్లోంచి అభిమాని గా వచ్చినది. అన్నా నువ్వు కొట్టగలవు. అన్నా నీకు బానిసలం.. మేం.. ఈ చిత్రానికి దర్శకనిర్మాతలు.. రచయితలు .. నా తల్లి వంటి వదిన గారికి చిత్రంలో నటించిన నటీనటులందరికీ .. ప్రత్యేకంగా అమితాబ్ బచ్చన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను“ అని అన్నారు.
నా జీవితంలో ఈ క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను..పవన్ కళ్యాణ్!
- Advertisement -
Advertisement