Homeటాప్ స్టోరీస్ఫ్యామిలీ ఫ‌స్ట్ అంటున్న అక్కినేని హీరో

ఫ్యామిలీ ఫ‌స్ట్ అంటున్న అక్కినేని హీరో

ఫ్యామిలీ ఫ‌స్ట్ అంటున్న అక్కినేని హీరో
ఫ్యామిలీ ఫ‌స్ట్ అంటున్న అక్కినేని హీరో

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా యావ‌త్ దేశం ఇడ్డందుల్ని ఎదుర్కొంటోంది. ఈ మ‌హ‌మ్మారి నుంచి ప్ర‌జ‌ల్ని ర‌క్షించాల‌న్న దృఢ సంక‌ల్పంతో కేంద్ర లాక్ డౌన్‌ని విధించింది. 21 రోజుల పాటు విధించిన లాక్ డౌన్ ఈ నెల 14న ముగుస్తున్న నేప‌థ్యంలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో లాక్‌డౌన్‌ను పొడిగించారు. ఈ నేప‌థ్యంలో అంతా ఇంటికే ప‌రిమితం కావాల‌ని, ఇళ్లే శ్రేయ‌స్క‌ర‌మ‌ని దేశ ప్ర‌ధానితో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వం, సెల‌బ్రిటీలు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో అఖిల్ పెట్టిన పోస్ట్ ఆక‌ట్టుకుంటోంది. త‌ల్ల‌దండ్రులు అక్కినేని నాగార్జున‌, అమ‌ల‌తో క‌లిసి దిగిన ఓ ఫోటోని షేర్ చేసిన అఖిల్ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని షేర్ చేశారు. ఈ ఇద్ద‌రి గురించి వ‌ర్ణించ‌డానికి నా ద‌గ్గ‌ర ప‌దాలు లేవు. ఈ విష‌యంలో నేను చాలా అదృష్ట‌వంతుడిని. ఎవ‌రికైనా ఫ్యామిలీనే ఫ‌స్ట్ ఆ త‌రువాతే ఎవ‌రైనా. ఈ విష‌యాన్ని అర్థం చేసుకుని ఇంట్లోనే వుండండి.. సేఫ్‌గా వుండండి. పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. అని పేర్కోన్నారు.

- Advertisement -

ప్ర‌స్తుత విప‌త్తు నుంచి మ‌నం త్వ‌ర‌లోనే తేరుకుంటామ‌నే న‌మ్మ‌క‌ముంది అన్నారు. అక్కినేని అఖిల్ న‌టిస్తున్న తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌`. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మాత బ‌న్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All