కరోనా మహమ్మారి కారణంగా యావత్ దేశం ఇడ్డందుల్ని ఎదుర్కొంటోంది. ఈ మహమ్మారి నుంచి ప్రజల్ని రక్షించాలన్న దృఢ సంకల్పంతో కేంద్ర లాక్ డౌన్ని విధించింది. 21 రోజుల పాటు విధించిన లాక్ డౌన్ ఈ నెల 14న ముగుస్తున్న నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ను పొడిగించారు. ఈ నేపథ్యంలో అంతా ఇంటికే పరిమితం కావాలని, ఇళ్లే శ్రేయస్కరమని దేశ ప్రధానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం, సెలబ్రిటీలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో అఖిల్ పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటోంది. తల్లదండ్రులు అక్కినేని నాగార్జున, అమలతో కలిసి దిగిన ఓ ఫోటోని షేర్ చేసిన అఖిల్ ఆసక్తికరమైన పోస్ట్ని షేర్ చేశారు. ఈ ఇద్దరి గురించి వర్ణించడానికి నా దగ్గర పదాలు లేవు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. ఎవరికైనా ఫ్యామిలీనే ఫస్ట్ ఆ తరువాతే ఎవరైనా. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఇంట్లోనే వుండండి.. సేఫ్గా వుండండి. పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ కృతజ్ఞతలు. అని పేర్కోన్నారు.
ప్రస్తుత విపత్తు నుంచి మనం త్వరలోనే తేరుకుంటామనే నమ్మకముంది అన్నారు. అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై అల్లు అరవింద్ సమర్పణలో నిర్మాత బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
No words will express what these two mean to me. Great full is all I can say. Family first ! Love and Happiness to all #StayHomeStaySafe pic.twitter.com/UbT8YnQB8b
— Akhil Akkineni (@AkhilAkkineni8) April 8, 2020
Credit: Twitter