తొలి సినిమా `అఖిల్` నుంచి ఇప్పటి వరకు హిట్ కోసం అక్కినేని అఖిల్ దండయాత్ర చూస్తూనే వున్నారు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాజిలర్`. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హేగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ని, ఫస్ట్లుక్ పోస్టర్ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.
`జోష్` ఫేమ్ వాసు వర్మ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే అఖిల్ మరో చిత్రాన్ని ఓకే చేసినట్టు తెలిసింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటించాలని, దాని ద్వారానే బిగ్ హిట్ని సొంతం చేసుకోవాలన్నది అఖిల్ కోరిక. అందు కోసమే తొలిసారి `అఖిల్`తో యాక్షన్ కథని ఎంచుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో మరోసారి యాక్షన్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట.
ఈ చిత్రానికి స్టైలిష్ డైరెక్టర్ సురేందర్రెడ్డి దర్శకత్వం వహించనున్నట్టు తెలిసింది. ఇటీవలే అఖిల్కు సురేందర్రెడ్డి కథ వినిపించారట. స్క్రిప్ట్ నచ్చడంతో గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. `సైరా నరసింహారెడ్డి` చిత్రం తరువాత సురేందర్రెడ్డి మెగా హీరో వరుణ్తేజ్తో ఓ సినిమా చేయాల్సింది. `బాక్సర్` షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో సురేందర్రెడ్డి ఆ కథని పక్కన పెట్టి అఖిల్తో సినిమాకు సిద్ధమయ్యారని తెలిసింది.