నందమూరి బాలకృష్ణ మరోసారి పవర్ఫుల్ రోల్ ను పోషిస్తోన్న చిత్రం అఖండ. బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకుడు. బాలయ్య – బోయ కాంబినేషన్ అంటేనే బ్లాక్ బస్టర్. వీరిద్దరూ చేసిన సింహా, లెజండ్ చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో వీరి మూడో చిత్రం అఖండపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.
ఈ చిత్ర షూటింగ్ తుదిదశకు చేరుకుంది. దీంతో అఖండ టీమ్ ప్రమోషన్స్ ను షురూ చేస్తోంది. అఖండ నుండి తొలి పాట ఈరోజు విడుదలవుతుంది. అడిగా అడిగా సాంగ్ ను ఈరోజు సాయంత్రం 5 గంటల 33 నిమిషాలకు విడుదల చేస్తారు. ఇక కొద్దిసేపటి క్రితం విడుదలైన సాంగ్ టీజర్ ఆహ్లాదంగా ఉంది. మంచి మెలోడీ అఖండ నుండి రానున్న ఫీలింగ్ కలిగింది.
ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెల్సిందే. బాలయ్య రెండు పాత్రల్లో ఎంటర్టైన్ చేయనున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.