Homeటాప్ స్టోరీస్పూరి తనయుడు చాలా 'రొమాంటిక్' అంటా...

పూరి తనయుడు చాలా ‘రొమాంటిక్’ అంటా…

పూరి తనయుడు చాలా 'రొమాంటిక్' అంటా...
పూరి తనయుడు చాలా ‘రొమాంటిక్’ అంటా…

‘పూరి జగన్నాధ్’ సినిమాలు అంటే హీరో, హీరోయిన్ ని ఫేమస్ చేయడానికి మాత్రమే తీస్తాడు…అంటే ప్రేక్షకుల కోసం కూడా ఉద్దెశించి తీస్తాడు అందులోనూ నిజం ఉంది. నిజానికి పూరి జగన్నాధ్ సినిమాల ప్రభావం హీరోకి, హీరోయిన్ కి మాత్రమే దక్కుతుంది. అలా ఉంటాయి ఆ సినిమాలు మరీ. అందుకే హీరో, హీరోయిన్స్ తెగ తాపత్రయ పడతారు పూరి తో సినిమా తియ్యడానికి.

అయితే పూరి కుటుంబం నుండి కూడా తమ్ముడు ‘సాయిరాం శంకర్’, తనయుడు ‘ఆకాష్ పూరి’ వారు కూడా తెలుగు పరిశ్రమకి పరిచయం అయ్యాడు. తమ్ముడు ‘నేనింతే’ సినిమాలో చేసిన అభిమాని పాత్ర బాగా జనాలకి నచ్చడంతో అన్నయ్య దర్శకత్వంలో ‘బంపర్ ఆఫర్’ సినిమా చేసి హిట్ అందుకున్నాడు. కానీ తనయుడు ఆకాష్ పూరి కి మాత్రం హిట్ ఇవ్వలేకపోయాడు. ‘మెహబూబా’ సినిమా ద్వారా తనయుడు పరిచయం అయ్యి హిట్ కొడతారు అనుకున్నారు, కానీ సినిమా గోరా పరాజయం పాలు అయ్యింది. దానికి దర్శకుడు మన పూరీనే.

- Advertisement -

అయితే ఇప్పుడు తనయుడికి హిట్ అవసరం అని చెప్పి, తన నిర్మాణంలో ‘ఛార్మి’ తో కలిసి నిర్మిస్తున్నారు ఒక సినిమాని. ఆ సినిమా పేరు “రొమాంటిక్”, ‘అనిల్ పాదూరి’ దర్శకుడు. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ‘కేతికశర్మ’ కథానాయిక పరిషయం అవుతుంది తెలుగు పరిశ్రమకి. ఇలా ఈ సినిమా చకచకా షూటింగ్ జరుపుకుంది. దర్శకుడు అనిల్ కూడా సినిమాని యువతకి నచ్చేలా చిత్రీకరించారు.

ఈ రోజు సినిమాలోని పోస్టర్ ని రిలీజ్ చేసారు, అందులో తనయుడు ఆకాష్ పూరి అమ్మాయిని ఘాటుగా వాటేసుకోవడం, సినిమా పేరు కూడా రొమాంటిక్ అయ్యి ఉండటం చూస్తుంటే, పూరి గారు తనయుడిని ఈ సారి రొమాంటిక్ గా చూపించాలని డిసైడ్ అయ్యారు అనడంలో సందేహం లేదు. ఆకాష్ పూరి కూడా ‘ఆంధ్ర పోరి’ , ‘మెహబూబా’ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యడంటా.

చూద్దాం మరీ పూరి జగన్నాధ్ గారు ప్రతి సినిమాలో రొమాంటిక్ కథానాయకుడిని చూపించినట్టుగా ఈ సినిమాలో తన కొడుకుని వేరొక దర్శకుడితో ఎలా డిజైన్ చేసాడో ఏమో? మొత్తానికి సినిమాకి ఈ రకంగా హైప్ రావడం కూడా మంచిదే కదా…

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All