Homeటాప్ స్టోరీస్పూరి జగన్నాధ్ నరకం అనుభవించాడట

పూరి జగన్నాధ్ నరకం అనుభవించాడట

Puri Jagannadh
Puri Jagannadh

ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదలకు సిద్దమైన సమయంలో ఎంతో నరకం అనుభవించాను , నన్ను చాలా ఇబ్బందులకు గురిచేసారు కొంతమంది ఇక వాళ్ళ సంగతి త్వరలోనే చెబుతానని అంటున్నాడు దర్శకులు పూరి జగన్నాధ్ . గతకొంత కాలంగా పూరి జగన్నాద్ కు సక్సెస్ లేక కెరీర్ పరంగా చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు . అగ్ర హీరోలు పూరి కి డేట్స్ ఇవ్వడమే కాదు కనీసం ఫోన్ కూడా ఎత్తలేదట !

ఆ కసితో మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు .దాంతో సరికొత్త జోష్ వచ్చింది పూరి జగన్నాధ్ లో అందుకే నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ వివరాలు త్వరలోనే తెలియజేస్తాను అని స్టేట్ మెంట్ ఇచ్చాడు . అయితే ఇప్పుడు కోపం ఉంది కాబట్టి ఆ మాట అంటున్నాడు కానీ కోపం తగ్గాక వాళ్ళ వివరాలు చెబుతాడా ఏంటి ? అయినా ఇక్కడ ఉన్నది కేవలం సక్సెస్ అంతేకాని బంధాలు , అనుబంధాలు కాదు !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All