కార్తి హీరోగా నటించిన చిత్రం `ఖైదీ`. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఎస్.ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయాన్ని సాధించింది. తొలిసారి ఎలాంటి డ్యూయెట్స్, కమర్షియల్ సాంగ్స్, హీరోయిన్ లేకుండా కార్తి చేసిన ప్రయోగాత్మక చిత్రమిది. సినిమా మొత్తం లుంగీ, ఒకే షర్ట్తో కార్తి నటించిన ఈ చిత్రం కొత్త తరహా చిత్రాలకు నాంది పలికింది అని చెప్పొచ్చు. గ్రిప్పింగ్ స్క్రీన్ప్లేతో ఇంటెన్స్ థ్రిల్లర్గా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
తెలుగు, తమిళ భాషల్లో సంచలనం సృష్టించిన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి డ్రీమ్ వారియక్ పిక్చర్స్ రీమేక్ చేయబోతోంది. కమర్షయల్ బ్లాక్బస్టర్గా నిలిచిన ఈ చిత్రంలో కార్తి పోషించిన ఢిల్లీ పాత్రని హిందీలో ఎవరు చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ చిత్ర బృందం శుక్రవారం ఓ ఆసక్తికరమైన వార్తని వెల్లడించింది.
ఈ చిత్రంలో హీరోగా అజయ్దేవగన్ నటిస్తుండటమే కాకుండా నిర్మాతల్లో ఓ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్టు కూడా డ్రీమ్ వారియర్ సంస్థ ప్రకటించింది. అవును తమిళ హిట్ చిత్రం `ఖైదీ` హిందీ రీమేక్లో నటిస్తున్నాను. 2021 ఫిబ్రవరి 12న రిలీజ్ చేయాలనుకుంటున్నాం` అని హీరో అజయ్ దేవగన్ వెల్లడించారు.