Homeటాప్ స్టోరీస్నానావ‌తి హాస్పిట‌ల్‌కు ఐశ్వ‌ర్యారాయ్‌, ఆరాధ్యా!

నానావ‌తి హాస్పిట‌ల్‌కు ఐశ్వ‌ర్యారాయ్‌, ఆరాధ్యా!

నానావ‌తి హాస్పిట‌ల్‌కు ఐశ్వ‌ర్యారాయ్‌, ఆరాధ్యా!
నానావ‌తి హాస్పిట‌ల్‌కు ఐశ్వ‌ర్యారాయ్‌, ఆరాధ్యా!

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఆయ‌న త‌న‌యుడు, హీరో అభిషేక్ బ‌చ్చ‌న్ క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. వైర‌ల్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌టంతో ఈ ఇద్ద‌రు తండ్రీ కొడుకులు ముంబైలోని నానావ‌తి ఆసుప‌త్రిలో గ‌త కొన్ని రోజులుగా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఆ వెంట‌నే మ‌రో పిడుగు లాంటి వార్త ఐశ్వ‌ర్యారాయ్‌, ఆరాధ్య‌ల‌కు కూడా స్వ‌ల్పంగా కోవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని తేల‌డంతో ఆ ఇద్ద‌రిని ఇంటిలోనే స్వీయ‌నిర్భంధంలో వుండాల‌ని డాక్ట‌ర్లు సూచించారు.

అయితే శుక్ర‌వారం రాత్రి ఈ ఇద్ద‌రికి క‌రోనా ల‌క్ష‌ణాలు మ‌రింత‌గా పెర‌గ‌డంతో ఆందోళ‌న‌కు గురైన అమితాబ్ కుటుంబం వెంట‌నే ఐశ్వ‌ర్యారాయ్‌, ఆరాధ్య‌ల‌ను నానావ‌తి ఆసుప‌త్రికి షిఫ్ట్ చేసింది. దీంతో వీరు వుంటున్న జ‌ల్సా నివాసాన్ని తాత్కాలికంగా మూసి వేశారు. ఉన్న‌ట్టుండి ఐశ్వ‌ర్యారాయ్‌ని ఆసుప‌త్రికి త‌ర‌లించ‌డంతో ఆమె అభిమానులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

- Advertisement -

ఇలా ఓ స్టార్స్ కుటుంబం జ‌య‌బ‌చ్చ‌న్ మిన‌హా ఆసుప‌త్రిలో చేర‌డంతో దేశ వ్యాప్తంగా వున్న అభిమానుల్లో ఆందోళ‌న మొద‌లైంది. స్టార్ ఫ్యామిలీ ప‌రిస్థితే ఇలా వుంటే ఇక సామాన్యుడి గురించి చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని, క‌రోనా వ‌ల్ల ప‌రిస్థితులు మ‌రింత దారుణంగా మారుతున్నాయ‌ని కొంత మంది నిర్వేదాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All