దగ్గుపాటి అభిరాం హీరో గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే దగ్గుపాటి ఫ్యామిలీ నుండి వచ్చిన వెంకటేష్ , రానా లు రాణిస్తుండగా..ఇప్పుడు వీరిబాటలోనే అభిరాం రాబోతున్నాడు. డైరెక్టర్ తేజ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈరోజు తేజ బర్త్ డే సందర్భాంగా ఈ చిత్ర ప్రీ లుక్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు.
తేజ డైరెక్షన్లో ఉదయ్ కిరణ్, నితిన్ , నవదీప్ మొదలగువారు హీరోలుగా ఇండస్ట్రీ కి పరిచమయ్యారు. ఇక ఇప్పుడు అభిరాం పరిచయం కాబోతున్నాడు. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై జెమినీ కిరణ్ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి అహింస అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ప్రీ రిలీజ్ చేసారు. ‘అహింసా పరమో ధర్మః ధర్మ హింస తదైవచ’ అంటూ ప్రచారం ప్రారంభించారు. అభిరామ్ ముఖం కనిపించకుండా కళ్ళవరకూ గోను బస్తాతో కట్టేసి ఉండగా.. అతడి కళ్ళనుంచి రక్తం కారుతూ ఉండే లుక్ ఆకట్టుకుంటోంది. టైటిల్ కు క్వైట్ కాంట్రాస్ట్ గా ఈ సినిమా లుక్ ఉండడం ఆశ్చర్యపరుస్తోంది.
ఇక ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్ పై హీరోయిన్ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఇక ఈ సినిమాకి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించనుండడం విశేషంగా మారింది. తేజ, ఆర్పీ కాంబినేషన్ లో గతంలో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ వచ్చాయి. త్వరలోనే రిలీజ్ డేట్ తో పాటు మిగతా కాస్టింగ్ వివరాలు కూడా తెలుపబోతున్నట్లు తెలిపారు మేకర్స్.
అహింసా పరమో ధర్మః,
ధర్మహింసా తధైవచ !!Presenting the Fierce Pre Look Poster of #AbhiramDaggubati’s #AHIMSA ?
A Film by @tejagaru ?
Principal Shoot Completed #Kiran @rppatnaik #SameerReddy @boselyricist @AnandiArtsOffl
#HappyBirthdayTeja pic.twitter.com/LGrtZXLatu— BA Raju’s Team (@baraju_SuperHit) February 22, 2022