క్షణం, అమీతుమీ, గూఢచారి తో హ్యాట్రిక్ హిట్స్ సాధించిన అడవి శేష్ నటించిన ఎవరు సినిమా ఆగస్ట్ 15న రేపు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ కి ముందే పాజిటివ్ బజ్ ఏర్పడిన ఈ చిత్రం పై మంచి ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి.
రెజీనా కాసాండ్రా, నవీన్ చంద్ర నటించిన ఈ చిత్రానికి వెంకట్ రాంజీ దర్శకత్వం వహించారు. ఇక శేష్ నటించే ‘మేజర్’ చిత్రం సెప్టెంబర్ లో మొదలు కానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు, సోనీ మ్యూజిక్ నిర్మించనున్నారు. శశి కిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకుడు. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
అశోక్ చక్ర బిరుదు పొందిన ఆయన కార్గిల్ యుద్ధం అనంతరం ముంబై హోటల్ బాంబ్ పేలుళ్ల సమయంలో అనేక మండిన రక్షించి ఆ కాల్పుల్లో మరణించారు. ఇప్పుడు ఆయన బయోపిక్ ని మేజర్ రూపంలో సినిమాగా రాబోతుంది. అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.