ముంబైని కరోనా కకావికలం చేస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ని అల్లాడిస్తోంది. మొన్న బోనీకపూర్ ఇంట్లో.. నిన్న కరణ్ జోహార్ నివాసంలో కరోనా కలకలం సృష్టించింది. రీసెంట్గా మ్యూజిక్ డైరెక్టర్ వాజీద్ఖాన్ కరోనా కారణంగా మృతి చెందడం తెలిసిందే. ఇదిలా వుంటే తాజాగా బాలీవుడ్ నటితో పాటు ఆమె కుటుంబానికి కూడా కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టిస్తోంది.
`యే రిస్తా క్యా కెహతా హై` చిత్రంలో నటించిన మోహెనా కుమారి సింగ్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత ఏడాది అక్టోబర్లో ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి కుమారుడు సుయేష్ రావత్ను వివాహం చేసుకుంది. నటి మోహెనా కుమారి, ఆమె భర్త సుయేష్ రావత్తో పాటు మామ సత్పాల్ మహరాజ్లకు కరోనా సోకడంతో వారిని హాస్పటల్కు తరలించారు.
నాకు, నా కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం మేమంతా హాస్పటల్లో చికిత్స పొందుతున్నాం. కరోనా లక్షణాలు తక్కువగా వున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి మేము త్వరగా కోలుకుంటామని భావిస్తున్నా` అని నటి మోహెనా కుమారి సింగ్ వెల్లడించింది.