Homeటాప్ స్టోరీస్టీడీపీ కి షాక్ ఇస్తున్న జయసుధ

టీడీపీ కి షాక్ ఇస్తున్న జయసుధ

Actress jayasudha joins YSRCPసహజనటి జయసుధ తెలుగుదేశం పార్టీకి షాక్ ఇస్తూ వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది . 2009 లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ గా గెలుపొందిన జయసుధ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ వైపుకి వెళ్ళింది కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయింది . 2014 లో కాంగ్రెస్ పార్టీ తరుపున మరోసారి పోటీచేసింది అయితే ఈసారి ఓడిపోయింది . దాంతో కొంతకాలం సైలెంట్ గా ఉన్న జయసుధ 2016 లో తెలుగుదేశం పార్టీలో చేరింది .

 

- Advertisement -

కానీ ఇపుడేమో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో జగన్ తో సమావేశం కావడానికి సిద్ధం అవుతోంది . జగన్ తో సమావేశం అయ్యాక వై ఎస్సార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది . ఇప్పటికే పలువురు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ జగన్ పంచన చేరుతుండగా ఆ వరుసలో జయసుధ కూడా చేరుతోంది .

English Title : Actress jayasudha joins YSRCP

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All