ఈ నెలాఖరున రియాలిటీ షో బిగ్బాస్ సీజన్ 4 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా దీనిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇందులో మూడవ సీజన్కు హోస్ట్గా వ్యవహరించిన హీరో అక్కినేని నాగార్జుననే సీజన్ 4కు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలు ఈ షో పై భారీ క్రేజ్ని క్రియేట్ చేశాయి. ఇదిలా వుంటే ఈ షోలో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారని వరుస కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో నటుడు నందు చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
నటుడు నందు తాజాగా సోషల్ మీడియా ఇన్స్టా గ్రామ్లో బిగ్బాస్ సీజన్ 4పై ఆసక్తికరంగా స్పందించారు. ఈ షోలో పాల్గొనబోతున్న 16 మంది కంటెస్టెంట్లలో నందు కూడా వున్నారంటూ ఇటీవల వరుస కథనాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆ కథనాలు వాస్తవమేని నందు తాజాగా ప్రకటించాడు. బిగ్బాస్ షోలో తను పాల్గొంటున్నట్టు స్పష్టం చేశాడు. ఈ షోలో తన ప్రయాణాన్ని కొనసాగించడానికి మీ వంతు సహకారం కావాలని ఇన్స్టా వేదికగా విజ్ఞప్తి చేశాడు.
`డార్లింగ్స్ నేను బిబిలో ఎంటరవుతున్నా. బిబిలో మన రచ్చ మామూలుగా వుండదు. మీకు మరింత వినోదాన్ని అందించబోతున్నాం. ఇందుకు మీ సహకారం కావాలి. అయితే రేపు సాయంత్రం 6 గంటలకు మరో అప్డేట్ రెడీ వుంది. మళ్లీ ఇక్కడే కలుద్దాం` అని నందు తన బిగ్ బాస్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు.