మెగా స్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య షూటింగ్ అనుకున్న దానికంటే బాగా ఆలస్యమైంది. వరసగా రెండు కరోనా వేవ్స్ కారణంగా షూటింగ్ బాగా డిలే అయింది. కొరటాల శివ ఈ సినిమాకు దాదాపు మూడేళ్లు వెచ్చించాడు. ఏదైతేనేం మొత్తానికి ఆచార్య షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఈ చిత్ర చివరి షెడ్యూల్ జులై మొదటి వారంలో షురూ అవ్వనుంది. దాదాపు 15 రోజుల వర్క్ ఇంకా పెండింగ్ ఉంది. ఇంకా రామ్ చరణ్, పూజ హెగ్డే కాంబినేషన్ లో ఒక సాంగ్, చిరు, కాజల్ మధ్య ఒక సాంగ్ ను చిత్రీకరించాలి. ఆగస్ట్ కల్లా ఆచార్య చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
అయితే ఇంకా ఆచార్య విడుదల తేదీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రామ్ చరణ్ స్పెషల్ పాత్ర చేస్తోన్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. మణిశర్మ సంగీత దర్శకుడు.