కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో నిత్యం విధులు నిర్వహిస్తున్న పోలీసుల కోసం నేను సైతం అంటూ ముందుకొచ్చారు యంగ్ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్. తన సేవా భావాన్ని మరోసారి నిరూపించుకున్నారు. లాక్డౌన్ సమయంలో కరోనాని ధీటుగా ఎదుర్కొంటూ తమ ప్రాణాలని సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అధునాతన, నాణ్యమైన పర్సనల్ ప్రొడక్షన్ కట్స్లని పంపిణీ చేశారు.
గురువారం బషీర్బాగ్ కమీషనరేట్ అంజనీకుమార్ని కలుసుకున్న అభిషేక్ అగర్వాల్ పీపీఈ కిట్స్ని ఆయన సమక్షంలోనే అందజేశారు. పోలీసులకు ఇష్టమైన ఖాకీ రంగులో డిజైన్ చేసిన కిట్లు రూపొందించారు. దేశంలోనే ఈ తరహా కిట్లు పోలీసులకు పంపిణీ చేయడం ఇదే ప్రధమం. ఇది వరకు ప్రముఖ కథానాయకులు నిఖిల్, శ్రీవిష్ణు. సందీప్ కిషన్ కలిసి ఆహారంతో పాటు మాస్కులు, శానిటైజర్లను అవసరార్ధులకు అందించి ఆదుకుంటున్నారు అభిషేక్.
ప్రస్తుతం నిఖిల్ హీరోగా `కార్తికేయ-2`, అడివిశేష్ హీరోగా `గూఢచారి -2` అనుపమ్ఖేర్ ప్రధాన పాత్రలో `కాశ్మీర్ ఫైల్స్` వీటితో పాటు అబ్దుల్ కలామ్ బయోపిక్ ని నిర్మంచిబోతున్నారు. తమిళంలో విజయవంతమైన `ఆరువి` చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు.
Producer @AbhishekOfficl sponsored PPE kits to #HyderabadCityPolice in the presence of @CPHydCity today.@hydcitypolice becomes the first in the country to get the most high end PPE kits for the patrolling staff to fight corona.@KTRTRS @TelanganaCMO pic.twitter.com/HKbDrnFSjE
— BARaju (@baraju_SuperHit) April 24, 2020
Credit: Twitter