కింగ్ అక్కినేని నాగార్జున చాలా కాలంగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుంటున్నారు. నిత్యం అభిమానులకు అందుబాటులో ఉంటున్న నాగ్ తన సినిమాలకు సంబంధించిన విషయాల్ని అభిమానులతో పంచుకుంటున్నారు.
తన సినిమాల విశేషాలతో పాటు చైతు, అఖిల్ సినిమాల వార్తల్ని కూడా షేర్ చేస్తున్నారు ఆయనని ఫాలో అవుతున్న వారి సంఖ్య తాజాగా 6 మిళియన్స్ దాటింది. ఈ సందర్భంగా నాగార్జున తనని ఫాలో అవుతున్న వారికి కృతఙ్ఞతలు చెప్పారు.
కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’. హైదరాబాద్ లో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఈ చిత్రాన్ని క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది సెప్టెంబర్ లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
- Advertisement -