లాక్డౌన్ కారణంగా థియేటర్లు గత ఎనిమిది నెలలుగా మూతపడటంతో ఓటీటీలకు డిమాండ్ ఏర్పడింది. మొదట్లో కొంత మిశ్రమంగా స్పందన వున్నా వినోదానికి ఓటీటీలు తప్ప మరేదీ లేకపోవడంతో అంతా వీటినే అనుసరించడం మొదలుపెట్టారు. దీంతో డిజిటల్ ప్లాట్ ఫామ్ లకు మరింత డిమాండ్ ఏర్పడింది. ఎంతలా అంటే ఫ్లాప్ సినిమాకు కూడా రికార్డు స్థాయి వ్యూస్ వచ్చేంత.
ఇటివల ఓటీటీ ప్లాట్ ఫామ్లలో విడుదలై డివైడ్ టాక్ని దక్కించుకున్న సినిమాలని చూస్తే ఈ విషయం అర్థమైంది. ఇటీవల అనుష్క నటించిన `నిశ్శబ్దం`, కీర్తిసురేష్ నటించిన `మిస్ ఇండియా` వంటి చిత్రాలు తొలి స్ట్రీమింగ్కే డివైడ్ టాక్ని దక్కించుకున్నాయి. తాజాగా అక్షయ్కుమార్ నటించిన `లక్ష్మి` చిత్రానికి ఇదే తరహా ఆదరణ లభించడం విశేషం. అంతే కాకుండా ఈ మూవీ ఓటీటీల్లో విడుదలైన చిత్రాల్లోనే సరికొత్త రికార్డుని నెలకొల్పింది. టాక్ వైజ్గా ఫ్లాప్ అనిపించుకున్నఈ మూవీ ఇప్పటి వరకు ఇండియాలో ఓటీటీ వేదికగా విడుదలైన తొలి బిగ్ ఫిల్మ్గా చెబుతున్నారు.
అంతే కాకుండా డిజిట్ ఫ్లాట్ ఫామ్లో అత్యధిక వ్యూస్ని సాధించిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించినట్టు తెలుస్తోంది. ఈ రికార్డు ఇంతకు ముందు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన `దిల్ బెచారా` మూవీ పేరు మీద వుంది. ఆ రికార్డును `లక్ష్మీ` కేవలం హాఫ్ డేలోనే అధిగమించడం సంచలనంగా మారింది. తాజా లెక్కలని బట్టి చూస్తే `లక్ష్మి` డిజిటల్ ప్లాట్ ఫామ్లో భారీ స్థాయిలోనే వసూళ్ల వర్షం కురిపించి వుంటుందని చెబుతున్నారు. ఈ మూవీ డిస్నీ హాట్ స్టార్లో విడుదలైంది.