వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ చిత్రం ” యాత్ర ” ఈనెల 7 ఆదివారం రోజున బుల్లితెరపై ప్రసారం కానుంది . మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన చిత్రం యాత్ర . ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ యాత్ర చిత్రం బ్లాక్ బస్టర్ కాదు కానీ ఫరవాలేదనిపించింది . మంచి వసూళ్ళని సాధించింది . అయితే ఎన్నికల పోలింగ్ దగ్గర పడిన ఈ సమయంలో యాత్ర చిత్రం టివిలో ప్రసారం కావడం అంటే జగన్ పార్టీకి మంచి అవకాశం అన్నమాటే !
- Advertisement -
స్టార్ మా టివిలో ఈ ఆదివారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది . రాజశేఖర్ రెడ్డి పట్ల పేద ప్రజల్లో మంచి సానుభూతి ఉంది దాంతో ఎన్నికల సమయంలో ప్రసారం కావడం అంటే ఖచ్చితంగా కొంత వరకు ఓట్ల రూపంలో ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు జగన్ పార్టీ నేతలు .
- Advertisement -