2013 లో కన్నడంలో విడుదలైన ” కనసు ” చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ” సంతోష్ శెట్టి ” జల సమాధి అయ్యాడు . అత్యంత విషాదకరమైన ఈ సంచలన సంఘటన కర్ణాటకలో జరిగింది . కొద్దీ రోజులుగా కురుస్తున్న వర్షాలకు కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా లో వాగులు , నదులు ఉప్పొంగి పోతున్నాయి కాగా అదే సమయంలో షూటింగ్ నిమిత్తం దర్శకులు సంతోష్ శెట్టి నిన్న ఉదయం అయిదుగురి బృందంతో కలిసి బెల్తoగడి తాలూకా లోని ఎర్మయ్ ఫాల్స్ కి వెళ్ళాడు .
అయితే షూటింగ్ లో భాగంగా కాలుకి బరువైన వస్తువు కట్టుకున్నాడు , అదే సంతోష్ శెట్టి ప్రాణాలను మింగేసింది . షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వరద ఉదృతి ఎక్కువ కావడంతో అదుపుతప్పి నదిలో పడిపోయాడు సంతోష్ శెట్టి . ఒక్కసారిగా షాక్ అయిన మిగతా సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బంది కి తెలియజేయడంతో గాలించగా అప్పటికే జలసమాధి అయ్యాడు ఆ యువ దర్శకుడు . షూటింగ్ చేయడానికి సంతోషంగా వచ్చిన సంతోష్ శెట్టి జల సమాధి కావడంతో తల్లడిల్లిపోయారు ఆ చిత్ర బృందం . ఎట్టకేలకు యువ దర్శకుడి మృతదేహాన్ని వెలికి తీసి కుటుంబ సభ్యులకు అందజేశారు . విగతజీవి గా సంతోష్ ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతం అయ్యారు . యువ దర్శకుడి మృతి తో కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి కి లోనయ్యింది .