
గతంలో ఈ అవార్డును శ్రీమతి లతా మంగేష్కర్, శ్రీ అమితాబ్ బచ్చన్, శ్రీమతి రేఖ, శ్రీ షారుక్ ఖాన్ అందుకున్నారు. ఎప్పటిలానే ఈ సారి కూడా ఈ అవార్డు ప్రదానోత్సవం ముంబైలో ఫిబ్రవరి 16న ఘనంగా జరుగుబోతోంది. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సిహెచ్. విద్యాసాగర్ రావుతో పాటు లతామంగేష్కర్ చేతుల మీదుగా ‘నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు -2017’ను ఆశాభోస్లే అందుకోబోతున్నారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్, షారుక్ ఖాన్, శ్రీదేవి, జయప్రద తదితరులు పాల్గొనబోతున్నారు.
1933లో జన్మించిన ఆశాభోస్లే పదేళ్ళ ప్రాయంలోనే నేపథ్య గాయనిగా తన కెరీర్ ను ప్రారంభించారు. గడిచిన 75 సంవత్సరాల్లో వందల చిత్రాలలో వేలాది గీతాలు ఆలపించిన ఆశాభోస్లే రెండు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డును అందుకోవడంతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించుకున్నారు. ఆమె కీర్తి కిరీటంలో ‘నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డ్’ మరో కలికితురాయిగా నిలువబోతోంది.
- Advertisement -