Homeన్యూస్ప్రపంచంలోనే ప్రప్రథమం రాంగోపాల్ వర్మచే ఆవిష్కారం!! తెలుగు పబ్ @ కూచిపూడి వెంకట్ మారేడుమిల్లి

ప్రపంచంలోనే ప్రప్రథమం రాంగోపాల్ వర్మచే ఆవిష్కారం!! తెలుగు పబ్ @ కూచిపూడి వెంకట్ మారేడుమిల్లి

ప్రపంచంలోనే ప్రప్రథమం రాంగోపాల్ వర్మచే ఆవిష్కారం!! తెలుగు పబ్ @ కూచిపూడి వెంకట్ మారేడుమిల్లి
ప్రపంచంలోనే ప్రప్రథమం రాంగోపాల్ వర్మచే ఆవిష్కారం!! తెలుగు పబ్ @ కూచిపూడి వెంకట్ మారేడుమిల్లి

హైదరాబాద్ ఫుడ్ ఇండస్ట్రీలో “రుచికరమైన విప్లవాలు” ఎన్నింటినో అలవోకగా ఆవిష్కరిస్తున్న ప్రముఖ దర్శకుడు కూచిపూడి వెంకట్… తాజాగా మరో సంచలనానికి తెర తీశారు. ఆహ్లాదకరమైన అటవీ వాతావరణాన్ని తలపించేలా వెంకట్ సారథ్యంలో గచ్చిబౌలిలో ప్రారంభమై… నోరూరించే రుచులతో భోజన ప్రియులను ఉర్రూతలూగిస్తున్న “మారేడుమిల్లి” రెస్టారెంట్ కు అనుసంధానంగా “తెలుగు పబ్”కు ఆయన శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెంకట్… “డీజే అప్పారావ్” అనే అనే సంగీత ప్రియుడి పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. హోటల్ ఇండస్ట్రీలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన “మారెడుమిల్లి” రెస్టారెంట్ ను ఆస్కార్ విజేత ఎస్.ఎస్.రాజమౌళి ప్రారంభించడం తెలిసిందే!!

తాజా ఈ వన్ అండ్ ఓన్లీ “తెలుగు పబ్”ను దర్శక సంచలనం రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరించి.. ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి… కూచిపూడి వెంకట్ ప్రవేశ పెట్టిన “బీర్టెయిల్” – డీజే అప్పారావ్” అనే కాన్సెప్తులు తనకు విపరీతంగా నచ్చాయని, ఇవి కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతాయని ఆర్జీవి పేర్కొన్నారు. ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో ఈ అచ్చ “తెలుగు పబ్” పసందైన వినోదం అందించనుంది!!

- Advertisement -

“మొదటి సినిమా, జాన్ అప్పారావు 40 ప్లస్” చిత్రాలతో దర్శకుడిగా తన ప్రత్యేకత చాటుకున్న కూచిపూడి వెంకట్… గత కొన్నేళ్లుగా “హోటల్ ఇండస్ట్రీ”ని ఒక కుదుపు కుదుపుతుండడం తెలిసిందే. అందులో భాగంగా… పబ్ లో పాశ్చాత్య సంగీతం మాత్రమే ఎందుకు ప్లే చేయాలి? అచ్చమైన మన తెలుగు పాటలు ఎందుకు వినిపించకూడదు? మన పాటలు… ఏ పాటల కంటే తక్కువ? అనే మథనం నుంచి “తెలుగు పబ్” పురుడు పోసుకుందని వెంకట్ తెలిపారు. అలాగే బీరును పలు రకాల తెలుగు ఫ్లేవర్స్ లో అందించడం కోసం “బీర్టెయిల్”కు జీవం పోశామని, “మారేడుమిల్లి” ప్రియులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వేరే ఫ్లోర్ లో ఇది ఏర్పాటు చేశామని ఈ బహుముఖ ప్రతిభాశాలి వివరించారు!!

“తమ కాలక్షేపం కోసం ఎదుటివారి సమయాన్ని విచ్చలవిడిగా వేస్ట్ చేసేవారికి చెంపపెట్టులాంటి వినూత్నమైన కాన్సెప్ట్”తో తన మూడో చిత్రం కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని ఈ సందర్భంగా వెంకట్ ప్రకటించారు. త్వరలోనే “కూచిపూడి పలావ్” ఫ్రాంచైజ్ లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కూడా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సుమన్ వర్మ, సంచలన రచయిత బి.వి.ఎస్.రవి తదితరులు పాల్గొని కూచిపూడి వెంకట్ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All