కర్ణాటక లో 104 సీట్లు గెల్చుకున్న అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేదు అలాగే 78 స్థానాలను పొందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం లేదు కానీ 38 స్థానాలను గెల్చుకున్న జేడీఎస్ మాత్రం ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని పొందుతోంది దానికి కారణం ఒక్కటే …….. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం భారతీయ జనతా పార్టీ కి ఇష్టం లేదు అలాగే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం కాంగ్రెస్ పార్టీ కి ఇష్టం లేదు దాంతో అయిష్టంగానే జేడీఎస్ కు మద్దతు ఇచ్చారు కట్ చేస్తే ఈరోజు కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు .
కర్ణాటకలో లాగే 2019 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవనున్నట్లు అప్పుడే ప్రచారం జరుగుతోంది . 2019 లో ఆంధ్రప్రదేశ్ లో త్రిముఖ పోటీ ఉంటుందని ఇంతకుముందే పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే . ఒకవైపు జగన్ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతగా సుముఖంగా లేరు అలాగే చంద్రబాబు పట్ల కూడా అంతగా ఆసక్తి కనబరచడం లేదు దాంతో పవన్ కళ్యాణ్ జనసేన కు కాస్త అడ్వాంటేజ్ ఉంది . అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సీట్లు పవన్ కళ్యాణ్ సాధించడం ఖాయం , అప్పుడు చంద్రబాబు కి కానీ జగన్ కు కానీ సరైన మెజారిటీ రానప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతాడు . జగన్ అధికారం లోకి రావడం బాబు కి ఇష్టం ఉండదు అలాగే బాబు అధికారంలోకి రావడం జగన్ కు ఇష్టం ఉండదు అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కు కర్ణాటక లాగా కలిసి వచ్చినా ఆశ్చర్యం లేదు .