హాస్య నటుడిగా తెలుగు ప్రజల నీరాజనాలను అందుకున్న నటుడు ఏవీఎస్ . తుత్తి , రంగు పడుద్ది లాంటి ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు ఏవీఎస్ . హాస్య నటుడిగా అగ్రస్థాయికి చేరుకున్నాక దర్శకత్వం వైపు దృష్టి మళ్ళించాడు ఏవీఎస్ .
అయితే దర్శకుడిగా పలురకాలుగా ప్రయత్నాలు చేసాడు కానీ ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు పాపం . ఏది ఏమైతేనేం అనారోగ్యంతో అర్దాంతరంగా తనువు చాలించాడు ఏవీఎస్ .
కట్ చేస్తే ఇన్నాళ్లకు ఏవీఎస్ కొడుకు రాఘవేంద్ర ప్రదీప్ దర్శకుడిగా ” వైదేహి ” అనే హర్రర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు . తన తండ్రి పేరు ఏవీఎస్ వచ్చేలా యాక్టివ్ స్టూడియోస్ అనే పేరుతో ఓ బ్యానర్ స్థాపించి సినిమా చేసాడు .
హర్రర్ జోనర్ లో వచ్చిన చిత్రాలు హిట్ అయ్యేసరికి రాఘవేంద్ర ప్రదీప్ కూడా అదే జోనర్ ని ఎంపిక చేసుకున్నాడు . ట్రైలర్ కూడా విడుదల అయ్యింది . అయితే ఆ ట్రైలర్ అంత ఇంప్రెసివ్ గా లేదు . తండ్రి డైరెక్టర్ గా హిట్ కొట్టాలని ఆశపడ్డాడు కుదరలేదు కనీసం కొడుకైనా తండ్రి కోరిక నెరవేర్చుతాడా ? చూడాలి .