Homeటాప్ స్టోరీస్ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ , మహేష్ లు రాకపోవడానికి కారణం అదేనట

ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ , మహేష్ లు రాకపోవడానికి కారణం అదేనట

Why Pawan Kalyan and Mahesh Skipped Acharya Event
Why Pawan Kalyan and Mahesh Skipped Acharya Event

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచానాలు నెలకొని ఉన్నాయి. ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాబోతుంది. ఈ తరుణంలో నిన్న శనివారం యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్ లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అట్టహాసంగా జరిపారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా రాజమౌళి హాజరై వేడుకకు మరింత ఆకర్షణ తీసుకొచ్చారు. అయితే ముందుగా ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు లు కూడా వస్తారనే ప్రచారం జరిగింది. కానీ చివర్లో వీరు హాజరుకాలేకపోయింది.

వీరు హాజరు కాకపోవడానికి కారణాలు..పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. రైతుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న పవన్.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. శనివారం కూడా వారికీ ఆర్ధిక సాయం చేసేందుకు పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లారు. దీంతో అయన వేడెక్కకు హాజరు కాలేకపోయారు. ఇక మహేష్ ప్రస్తుతం సర్కారు వారి షూటింగ్ లో బిజీ గా ఉండడం తో రాలేకపోయారు. ఆలా వారిద్దరూ రాలేకపోయినట్లు తెలుస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All