హాట్ భామ రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో కిషోర్ కుమార్ దర్శకత్వంలో శ్రీధర్ రెడ్డి ,ఆనంద్ రెడ్డి , ఆర్కే రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ” వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి ”. ప్రవీణ్ – మధునందన్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈనెల 15 న రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చాడు నిర్మాత శ్రీధర్ రెడ్డి . వేర్ ఈజ్ వెంకట లక్ష్మి విశేషాలతో పాటుగా తన గురుంచి తన మాటల్లోనే ……
* అనంతపురం కు చెందినవాడినైన నాకు చిన్నప్పటి నుండి సినిమాలంటే చాలా చాలా ఇష్టం , దాంతో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూనే పలు సినిమాలను రిలీజ్ చేశాను . అయితే వాటిల్లో హిట్ అయినవి ఉన్నాయి అలాగే నష్టపోయినవి కూడా ఉన్నాయి దాంతో ఎవరో తీసిన సినిమాని రిలీజ్ చేయడం కంటే నేనే సినిమాలు చేస్తే బెటర్ కదా ! అని ఈ సినిమా ప్లాన్ చేశాను .
* దిల్ రాజు నిర్మాతగా నాకు స్ఫూర్తి , ఆయన నిర్మించిన పలు చిత్రాలు నన్ను ఎంతో ప్రభావితం చేసాయి దాంతో దిల్ రాజుని ఆదర్శంగా తీసుకొని చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాను . మొదటి చిత్రం తోనే చిత్ర నిర్మాణంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను .
* కిరణ్ చెప్పిన కథ నచ్చి అతడినే దర్శకత్వం చేయమని అడిగాను అయితే కిషోర్ అనే వ్యక్తిని తీసుకొచ్చాడు దాంతో కిషోర్ కు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చాం . ఇక హీరోయిన్ గా పలువురిని అనుకున్నాం కానీ రాయ్ లక్ష్మి ని హీరోయిన్ గా ఎంపిక చేసింది నేనే ! ఎందుకంటే థియేటర్ లోపల ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి ప్రవీణ్ , మధునందన్ లతో పాటుగా మిగతా వాళ్ళు ఉన్నారు కానీ థియేటర్ వరకు ప్రేక్షకులను తీసుకు రావాలంటే రాయ్ లక్ష్మీ నే కరెక్ట్ అని భావించి ఆమెని తీసుకున్నాం .
* గ్రామీణ నేపథ్యంలో వినోద ప్రధానంగా సాగే చిత్రం మా వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి . తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది . యువతకు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్న సినిమా కావడంతో ఖచ్చితంగా హిట్ అవుతుంది .
* ఈ సినిమా తర్వాత మరో నాలుగైదు ప్రాజెక్ట్ లు అనుకుంటున్నాం , అయితే ఏవి మెటీరియలైజ్ అవుతాయన్నది త్వరలోనే తెలియజేస్తాను .