వినయ విధేయ రామ ఘోర పరాజయం పొందడంతో దర్శకులు బోయపాటి శ్రీను కి నిర్మాత డివివి దానయ్య కు మధ్య గొడవ అవుతోంది . ఒకరి పై ఒకరు గరం గరంగా ఉన్నారు . జనవరి 11 న విడుదలైన వినయ విధేయ రామ చిత్రం డిజాస్టర్ అయ్యింది , అయితే గుడ్డిలో మెల్ల లాగా 60 కోట్ల షేర్ రాబట్టింది అయితే బయ్యర్లకు 30 కోట్ల మేర నష్టం వాటిల్లింది దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది .
- Advertisement -
భారీ నష్టం జరిగింది కాబట్టి నువ్ తీసుకున్న రెమ్యునరేషన్ లోంచి 5 కోట్లు తిరిగి ఇస్తే నేను చరణ్ పది కోట్లు కలిపి మొత్తం 15 కోట్లు బయ్యర్లకు పంచుతాం అని చెప్పాడట దాంతో బోయపాటి విబేధించాడట . ఇంకేముంది అరుచుకునేంత వరకు వెళ్ళింది వ్యవహారం . ఇప్పుడు ఫిలిం నగర్ లో ఇదే చర్చ .
English Title: War between boyapati and dvv danayya
- Advertisement -