ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నిధి అగర్వాల్, నాభా నటేష్ హీరోయిన్ గా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రం 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఊహించిన స్థాయి కంటే ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే నెలకొన్నాయి. అందరి అంచనాలను రీచ్ అవుతుందని చిత్ర యూనిట్ రిలేస్జ్ కి ముందే సంబరాలు చేసుకుంటున్నారు. ఆల్ రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. దీంతో చిత్ర నిర్మాత ఛార్మి చాలా హ్యాపీగా ఉన్నారు.
ఆమె ఆనందాన్ని రెట్టింపు చేసేలా స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమా గురించి పాజిటివ్ ట్వీట్స్ చేస్తున్నారు. ఈసారి పూరి హిట్ కొట్టడం ఖాయమని, అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. దీంతో ఛార్మి మిమ్మల్ని మిస్సవుతున్నాం సర్.. మీరు త్వరగా వస్తే మిమ్మల్ని వోడ్కాలో ముంచేస్తాం అంటూ ట్విట్టర్ లో సమాధానమిచ్చారు. దీనికి వర్మ నుండి ఎలాంటి రిప్లై రాలేదు. అయన ఎలా స్పందిస్తారో చూడాలి మరి.. మరోవైపు పూరి సైతం ఈసారి సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. తప్పకుండా విజయాన్ని అందుకుంటాననే ధీమాను వ్యక్తం చేస్తున్నారు!!
Glow glow .. success glow ????????❣️❣️❣️ missing u in hyd saaarrrrrrrrr .. will dip u in vodaka as soon as u come ???? https://t.co/40FXa3SxOk
— Charmme Kaur (@Charmmeofficial) July 16, 2019