Homeగాసిప్స్బక్కచిక్కి, లావెక్కి.. మహేష్ సినిమా కోసం విజయశాంతి

బక్కచిక్కి, లావెక్కి.. మహేష్ సినిమా కోసం విజయశాంతి

బక్కచిక్కి, లావెక్కి.. మహేష్ సినిమా కోసం విజయశాంతి
బక్కచిక్కి, లావెక్కి.. మహేష్ సినిమా కోసం విజయశాంతి

లేడీ అమితాబ్ గా టాలీవుడ్ లో పేరొందిన విజయశాంతి టాలీవుడ్ లో ఎన్నో మరుపురాని పాత్రలను పోషించింది. ముఖ్యంగా డేరింగ్ అండ్ డాషింగ్ పాత్రలకు విజయశాంతి పెట్టింది పేరు. హీరోలతో సమానంగా ఫైట్లు చేయగల నటి ఆమె. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. అలాంటి విజయశాంతి 13 ఏళ్ల క్రితం సినిమాలకు కామా పెట్టేసింది. మళ్ళీ ఇన్నాళ్లకు సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం సరిలేరు నీకెవ్వరుతో తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో ఆమె ప్రొఫెసర్ భారతి అనే పాత్రలో నటిస్తోందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెల్సిందే. సినిమాకు చాలా కీలకమైన ఈ పాత్ర లుక్ ను దీపావళి సందర్భంగా విడుదల చేసారు. ఆమె లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వచ్చింది. 13 ఏళ్ల తర్వాత విజయశాంతి చేస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు కూడా విజయశాంతి పాత్ర ఎలా ఉండబోతోందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ విజయశాంతి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సరిలేరు నీకెవ్వరు స్క్రిప్ట్ ను అనిల్ రావిపూడి తనకు నరేట్ చేసినప్పుడు రెండున్నర గంటలు నాన్ స్టాప్ గా కడుపు చెక్కలయ్యేలా నవ్వానని, మరోసారి తన పాత్ర ఎలా ఉండబోతోందో ఇంకో నరేషన్ అడిగానని,అంతా ఓకే అనుకున్న తర్వాతే సరిలేరు నీకెవ్వరు చిత్రంలో భారతి పాత్ర చేయడానికి ఒప్పుకున్నానని ఆమె అన్నారు. రీ ఎంట్రీకి ఇది పెర్ఫెక్ట్ పాత్ర. ప్రొఫెసర్ భారతి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. సినిమా కూడా చాలా బాగా వస్తోంది. ఫుల్లుగా నవ్విస్తుంది అని ఆమె అంది. ఇక ఈ పాత్ర ఒప్పుకున్న తర్వాత, పాత్రకు తగ్గట్లు ఫిట్ గా ఉండడానికి చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది విజయశాంతి. రెండు నెలలు ప్రతిరోజూ రెండు గంటల పాటు జిమ్ లోనే గడిపానని, దానికి తోడు స్పెషల్ డైట్ కూడా తీసుకోవడం వల్ల దాదాపు 10 కిలోల బరువు తగ్గి చాలా స్లిమ్ అయ్యానని విజయశాంతి చెప్పింది. అయితే తర్వాత దర్శకుడు, కెమెరా మ్యాన్ తన లుక్ ను టెస్ట్ చేసి ఇంత బరువు తగ్గాల్సిన పని లేదని అన్నారు. దాంతో మళ్ళీ తినడం మొదలుపెట్టి కొంత బరువు పెరిగి ప్రస్తుత లుక్ లోకి మారా అని ఆమె అంది. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా కానీ రాజకీయాలే తన మొదటి ప్రాధాన్యత అంటోంది విజయశాంతి.

- Advertisement -

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో కూడా కామెడీ బాగా వర్కౌట్ అవుతుందని సమాచారం. అనిల్ రావిపూడి గత చిత్రాలన్నీ కామెడీ బేస్డ్ గా తెరకెక్కిన సంగతి తెల్సిందే. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణంలో మహేష్ బాబు కూడా భాగస్వామి. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా, అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All