హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం `మాస్టర్`. మాళవికా మోహనన్ హీరోయిన్గా నటిస్తోంది. `ఖైదీ` ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్జావియర్ బ్రిట్టో దాదాపు 140 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. విభిన్నమైన కథగా తెరకెక్కిన చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
ఈ చిత్రంలో హీరోయిన్గా విజయ్కి జోడీగా నటిస్తున్న మాళవికా మోహనన్ ఓ ట్వీట్ కారణంగా అడ్డంగా బక్కైంది. ఈ చిత్రాన్ని ఈ నెలలోనే రిలీజ్ చేయాలని నిర్మాత ప్లాన్ చేశాడు. కానీ అనూహ్యంగా కరోనా వైరస్ విజృంభించడంతో రిలీజ్ని వాయిదా వేశారు. ప్రస్తుతం లాక్డౌన్ పిరనియెడ్ నడుస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం అంతా ఒకే ఇంట్లో వుంటే ఎలా వుండేవారు, ఎఏ పనుల్ఓ బిజీగా వుండేవారన్నది ఓ కార్టూన్ల విజయ్ ఫ్యాన్స్ డిజైన్ చేసి దాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు.
ఇందులో మాళవిక మోహనన్ తన పాత్ర వంట చేస్తూ కనిపించడంతో అసహనానికి గురై `ఊహల్లోనూ మహిళలు వంటగదికే పరిమితమా అని ట్వీట్ చేసింది. దీనిపై విజయ్ ఫ్యాన్స్ మండిపడ్డారు. మాళవికపై విరుచుకుపడ్డారు. ఓరేంజ్లో ట్రోలింగ్ చేయడంతో మాళవిక వెంటనే తన ట్వీట్ని డెలిట్ చేసింది. విజయ్ ఫ్యాన్స్ దాడిని గమనించిన చిన్మయి వెంటనే సై్పందించింది. తన అభిప్రాయం చెబితే దాడికి దిగుతారా? అంటూ ఆగ్రహించింది.