టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిత్రం `అర్జున్రెడ్డి`. తెలుగు చిత్రాల పంథాను మార్చి గేమ్ ఛేంజర్గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా విజయ్ దేవరకొండని రాత్రికి రాత్రి సూపర్స్టార్ని చేసిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమా ద్వారా కథానాయికగా షాలిని పాండే పరిచయమైంది. తొలి సినిమాలోనే బోల్డ్ సన్నివేశాల్లో, లిప్ లాక్ సన్నివేశాల్లో నటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. `అర్జున్రెడ్డి`లో షాలిని పాండే ప్రదర్శించిన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.
ఈ సినిమా తెచ్చిన క్రేజ్తో వరుస ఆఫర్లని సొంతం చేసుకుంటూ టాలీవుడ్లో క్రేజీ కథానాయికగా దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు కొత్త దర్శకుడితో నిర్మిస్తున్న చిత్రం `ఇద్దరి లోకం ఒకటే`, అనుష్క, మాధవన్ కీలక పాత్రల్లో తెలుగు, తమిళ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై కోన వెంకట్ నిర్మిస్తున్న `నిశ్శబ్దం` చిత్రాల్లో నటిస్తోంది. ఇవి కాకుండా తమిళంలో జివి ప్రకాష్కుమార్ తో కలిసి `100% లవ్` తమిళ రీమేక్లోనూ నటించింది. ప్రస్తుతం జీవా హీరోగా నటిస్తున్న `గొరిల్లా` చిత్రం చేస్తోంది షాలిని పాండే.
తాజాగా ఆమెకు బాలీవుడ్లో బంపర్ ఆఫర్ లభించింది. బాలీవుడ్ హీరోల్లో రణ్వీర్ సింగ్ క్రేజ్ ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో కబీర్ఖాన్ రూపొందిస్తున్న `83`లో నటిస్తున్నారు. దీపికా పదుకోన్తో కలిసి మధు మంతెన, కబీర్ఖాన్, సాజిద్ నదియా వాలా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ కాబోతోంది. ఇదిలా వుంటే రణ్వీర్ సింగ్ తనని హీరోగా పరిచయం చేసిన యష్రాజ్ఫిల్మ్కు ఓ సినిమా చేయబోతున్నారు. `జయేష్భాయ్ జోర్దార్` పేరుతో రానున్న ఈ చిత్రంలో `అర్జున్రెడ్డి` ఫేమ్ షాలిని పాండేకు హీరోయిన్గా నటించే గోల్డెన్ ఆఫర్ దక్కింది. గత కొంత కాలంగా బాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండేకు ఈ చిత్రం మంచి లాంచ్ ప్యాడ్ కానుందని చెబుతున్నారు.