టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు . ఫోర్బ్స్ ఇండియా థర్టీ అండర్ థర్టీ పేరుతో నిర్వహించిన జాబితాలో విజయ్ దేవరకొండ స్థానం పొందాడు . 2019 లో ఈ ఘనత సాధించిన టాలీవుడ్ స్టార్ అయ్యాడు విజయ్ దేవరకొండ . 2017 లో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగునాట ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే.
దేశ వ్యాప్తంగా 30 ఏళ్ల లోపు ఉన్న ప్రతిభావంతులను 300 మందిని ఎంపిక చేసుకొని అందులోనుండి 30 మందిని సెలెక్ట్ చేసారు ఫోర్బ్స్ ఇండియా వాళ్ళు . ఇక దీనికి సంబందించిన పూర్తి వివరాలతో ఫిబ్రవరి మ్యాగజైన్ ని రిలీజ్ చేయబోతున్నారు . అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత గీత గోవిందం చిత్రం కూడా విజయ్ దేవరకొండ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రంగా నిలిచింది . ప్రస్తుతం ఈ హీరో డియర్ కామ్రేడ్ తో పాటుగా క్రాంతిమాధవ్ చిత్రం కూడా చేస్తున్నాడు .
English Title: Vijay devarakonda in Forbes india 30 list