ఈరోజు మహాశివరాత్రి కానుకగా భోళా శంకర్ నుండి ‘వైబ్ ఆఫ్ భోళా’ పేరిట సరికొత్త వీడియో రిలీజ్ చేసి మెగా అభిమానుల్లో ఆనందం నింపారు. ప్రస్తుతం చిరంజీవి తన వయసు ను సైతం పక్కనపెట్టి వరుస సినిమాలతో అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. అలాగే ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. ఈ క్రమంలోనే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ రూపొందిస్తున్నాయి. రామ బ్రహ్మం సుంకర నిర్మాత. ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర ఈ చిత్రాన్నినిర్మాణపరమైన బాధ్యతలను పర్యవేక్షిస్తుంటారు.
అన్నాచెల్లెల అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న చిత్రమిది. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఇందులో ఉండేలా డైరెక్టర్ మెహర్ చూసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇందులో భాగంగా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటె ఈరోజు మహాశివరాత్రి సందర్బంగా మేకర్స్ ‘వైబ్ ఆఫ్ భోళా’ పేరుతో సరికొత్త వీడియో విడుదల చేసారు. ఈ వీడియో లో చిరంజీవి స్టైలిష్ గా చైన్ తిప్పుతూ జీప్ ముందు కూర్చున్నట్లు చూపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇక ఈ మూవీ లో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుండగా..హీరోయిన్ గా తమన్నా నటిస్తుంది. అలాగే రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా. మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు.