విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి బాబీ దర్శకత్వంలో వెంకీ మామ చేస్తున్న విషయం తెల్సిందే. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల అయ్యే అవకాశముంది.
అయితే దీని తర్వాత వెంకటేష్ చిత్రమేంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.
ఆ మధ్య సురేష్ బాబు మాట్లాడుతూ వెంకటేష్ మూడు ప్రాజెక్టులు కమిట్ అయ్యాడని, త్రినాధరావు నక్కినతో ఒక చిత్రం, తరుణ్ భాస్కర్ తో ఒక సినిమా అలాగే దే దే ప్యార్ దే రీమేక్ అని తెలిపాడు.
అయితే ప్రస్తుతం పరిస్థితులని బట్టి త్రినాధరావుతో సినిమా లేనట్టే అని తెలుస్తోంది. ఈ దర్శకుడు ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో ప్రాజెక్టు సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు. బెల్లంకొండ – త్రినాధరావు ప్రాజెక్ట్ సెట్ అయితే ఇక వెంకీతో సినిమా లేనట్లే. మరి వెంకీ తరుణ్ భాస్కర్ తో సినిమా చేస్తాడా లేదా రీమేక్ వైపు మొగ్గు చూపుతాడా అన్నది చూడాలి.