ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న వెంకీ మామ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. విక్టరీ వెంకటేష్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పే పనిలో ఉన్నారు. వీలైనంత త్వరగా డబ్బింగ్ పూర్తి చేసి సినిమాను విడుదలకు సిద్ధంగా ఉంచాలని నిర్మాతలు భావిస్తున్నారు.
వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ ఈ చిత్రానికి దర్శకుడు. నిజంగా మామా అల్లుళ్ళు అయిన వెంకీ, చైతూ సినిమాలో కూడా అవే పాత్రలు పోషిస్తుండడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. పైగా ప్రేమమ్ లో వీరిద్దరూ కాసేపు కనిపిస్తేనే ప్రేక్షకుల ఆనందానికి అవధుల్లేవు.
ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒక సినిమా మొత్తంలో కనిపించబోతున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ వెంకీ మామను నిర్మిస్తున్నారు.