
గని మూవీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వరుణ్ తేజ్..ఈరోజు కొత్త చిత్రానికి పూజా కార్య క్రమాలను పూర్తి చేసాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యూనిక్ కాన్సెప్ట్తో ఈ మూవీ తెరకెక్కబోతుంది. నాగబాబు సమర్పణలో ఎస్విసిసి బ్యానర్పై బాపినీడు, బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ ఈ సినిమా స్క్రిప్ట్ను అందజేయగా.. నాగబాబు ఫస్ట్ క్లాప్ అందజేశారు
ఈ చిత్రానికి ముఖేష్ కెమెరా, మిక్కీ జె మేయర్ సంగీతం అందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.
ఇక గని విషయానికి వస్తే.. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు వంటి నటినటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. రెనైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్లపై సిద్ధు ముద్దా, అల్లు బాబీ నిర్మించారు.