పవన్ కళ్యాణ్ జనసేన అనే రాజకీయ పార్టీ ని స్థాపించిన విషయం తెలిసిందే , ఆ జనసేన పార్టీకి మెగా హీరో వరుణ్ తేజ్ కోటి రూపాయలు విరాళం ఇవ్వగా పవన్ అన్న నాగబాబు 25 లక్షల విరాళం అందించారు దాంతో కోటి 25 లక్షల విరాళం అందిందని ట్విట్టర్ సాక్షిగా తెలిపాడు పవన్ కళ్యాణ్ . క్రిస్మస్ కానుకగా నాకు వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ గా భావిస్తానని అంటున్నాడు పవన్ కళ్యాణ్ . ఆంధ్రప్రదేశ్ లో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి . ఆ ఎన్నికల్లో జనసేన తరుపున అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు పవన్ .
ఆంధప్రదేశ్ లో మూడు ముక్కలాట గా పోరాటం సాగనుంది . తెలుగుదేశం , వై ఎస్సార్ కాంగ్రెస్ , జనసేన . మరి ఈ ముగ్గురిలో 2019 లో అధికారం చేపట్టేది ఎవరో ? ఇక నాగబాబు విషయానికి వస్తే …… నాగబాబు కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడు దాంతో తిరిగి ఇప్పుడు జనసేన కు తనవంతు బాధ్యతగా విరాళం ఇచ్చాడు .
English Title: Varun tej and nagababu donates party fund to janasena