హ్యాపీ డేస్ , కొత్త బంగారులోకం చిత్రాలతో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న వరుణ్ సందేశ్..ఆ కేజ్రీ ను వాడుకోలేకపోయాడు. కథను నమ్మకుండా వచ్చిన ప్రతి ఆఫర్ కు ఓకే చెప్పి , కెరియర్ దెబ్బ కొట్టుకున్నాడు. ప్రస్తుతం మళ్లీ సినిమాల ఫై ఫోకస్ పెట్టి జాగ్రత్త పడుతున్నాడు. తాజాగా ఈయన సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న మైఖేల్ మూవీ లో ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది.
యాక్షన్ బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రాన్ని రంజిత్ జేయకొడి తెరకెక్కిస్తున్నారు. ఇందులో సందీప్ కిషన్ సరసన హీరోయిన్గా మజిలీ ఫేమ్ దివ్యాన్షా కౌశిక్ నటిస్తోంది. ఇతర కీలక పాత్రల్లో దర్శకుడు గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ కలిసి పాన్ ఇండియా రేంజ్లో నిర్మిస్తున్నారు.