సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..నిత్యం పవన్ కళ్యాణ్ ఫై ప్రత్యేక ఫోకస్ పెడుతుంటాడు. సెటైర్లు వేయడం, విమర్శలు చేయడం వంటివి చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. అలాంటి వర్మ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఫై పాజిటివ్ గా కామెంట్స్ చేయడం అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పవన్ కళ్యాణ్ , రానా కలయికలో సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేసిన చిత్రం భీమ్లా నాయక్. సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ అందించడం విశేషం. థమన్ మ్యూజిక్ అందించగా.. నిత్య మీనన్, సంయుక్త మీనన్లు హీరోయిన్లు గా నటించారు. వరల్డ్ వైడ్ గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.
ఈ క్రమంలో సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున సినీ స్టార్స్ విషెష్ అందజేస్తుండగా..వర్మ సైతం పాజిటివ్ గా కామెంట్స్ పెట్టి వార్తల్లో నిలిచారు. ఈ సందర్భంగా వర్మ ట్వీట్ చేస్తూ.. ‘నేను ముందు నుంచి చెబుతున్నట్లు భీమ్లా నాయక్ సినిమాను హిందీలోనూ విడుదల చేయాలి. ఈ సినిమా హిందీలో కచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు. ఇక మరో ట్వీట్లో.. ‘భీమ్లా నాయక్ ఒక మెరుపు, పవన్ కళ్యాణ్ సునామి. రానా కూడా పవన్తో పాటీ పడీ నటించారు. మొత్తం మీదం భీమ్లానాయక్ భూకంపాన్ని సృష్టించింది’ అంటూ తనదైన శైలిలో రాసుకొచ్చారు. ప్రస్తుతం వర్మ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.