హీరో సాయిధరమ్ తేజ్ సోరుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం `ఉప్పెన`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం రిలీజ్కి సిద్ధంగా వుంది. ఇదిలా వుంటే ఈ సినిమా రిలీజ్ కాకుండానే వైష్ణవ్ తేజ్ మరో చిత్రాన్ని పట్టాలెక్కించారు.
ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. క్రిష్ ఫ్రెండ్ వై.రాజీవ్రెడ్డి, తండ్రి జాగర్లమూడి సాయిబాబా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రం మొదలైంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అత్యంత సహజత్వంగా రపొందిస్తున్నట్టు తెలిసింది.
ఈ చిత్రం కోసం ఓ నవల రైట్స్ని క్రిష్ తీసుకున్నారట. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన `కొండపొలం` నవల హక్కుల్ని పది లక్షలకు క్రిష్ సొంతం చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలిసింది. 2019లో విడుదలై ఈ నవల మంచి ఆదరణ పొందింది. కేవలం 40 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని క్రిష్ ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు.