తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు , చిన్నాన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి పై చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుండి టీఆర్ఎస్ తరుపున పోటీ చేయనున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వార్తలన్నీ నిరాధారం అంటూ ఆ వార్తలను ఖండించింది మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన . కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ కి , పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే . దాంతో మరో రెండు , మూడు నెలలలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరుపున ఉపాసన పోటీ చేయనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి .
ఇంకేముంది అవన్నీ గాలి వార్తలే ! నాకు అపోలో లో చాలా బాధ్యతలు ఉన్నాయి , అయినా చేవెళ్లలో మా చిన్నాన్న చాలా మంచి పనులు చేస్తున్నారు అంటూ ట్వీట్ చేసింది ఉపాసన . ఈ వార్తలు ఎలా పుట్టాయంటే …… ఉపాసన కేటీఆర్ కు మంచి స్నేహితురాలు కావడంతో చేవెళ్ల నుండి ఉపాసన ని పోటీ చేయిస్తాడని ఈ వార్తలు వచ్చేసాయి . చరణ్ కు భార్య చిరంజీవి కి కోడలు అయిన ఉపాసన అపోలో ఉపాధ్యక్షురాలిగా సేవలందిస్తోంది .
English Title: upasana condensed about her political entry