Homeటాప్ స్టోరీస్ఆ వార్తలను ఖండించిన ఉపాసన

ఆ వార్తలను ఖండించిన ఉపాసన

upasana condensed about her political entryతాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు , చిన్నాన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి పై చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుండి టీఆర్ఎస్ తరుపున పోటీ చేయనున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వార్తలన్నీ నిరాధారం అంటూ ఆ వార్తలను ఖండించింది మెగాస్టార్ చిరంజీవి కోడలు  ఉపాసన . కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ కి , పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే . దాంతో మరో రెండు , మూడు నెలలలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరుపున ఉపాసన పోటీ చేయనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి .

ఇంకేముంది అవన్నీ గాలి వార్తలే ! నాకు అపోలో లో చాలా బాధ్యతలు ఉన్నాయి , అయినా చేవెళ్లలో మా చిన్నాన్న చాలా మంచి పనులు చేస్తున్నారు అంటూ ట్వీట్ చేసింది ఉపాసన . ఈ వార్తలు ఎలా పుట్టాయంటే …… ఉపాసన కేటీఆర్ కు మంచి స్నేహితురాలు కావడంతో చేవెళ్ల నుండి ఉపాసన ని పోటీ చేయిస్తాడని ఈ వార్తలు వచ్చేసాయి . చరణ్ కు భార్య చిరంజీవి కి కోడలు అయిన ఉపాసన అపోలో ఉపాధ్యక్షురాలిగా సేవలందిస్తోంది .

- Advertisement -

English Title: upasana condensed about her political entry

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All