మా టీవీలో ప్రసారమయ్యే పవిత్ర బంధం సీరియల్ లో నటించిన ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది . హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీ లో నివాసం ఉంటున్న ఝాన్సీ తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది . సంచలనం సృష్టించిన ఈ సంఘటన బుల్లితెర పరిశ్రమని షాక్ కి గురిచేసింది . కృష్ణా జిల్లా ముదినేపల్లి కి చెందిన ఝాన్సీ మా టివిలో ప్రసారమయ్యే పవిత్ర బంధం సీరియల్ లో నటించింది .
అయితే సూర్య అనే వ్యక్తితో ప్రేమలో పడిన ఝాన్సీ సీరియల్ లను తగ్గించడమే కాకుండా అతడితో సహజీవనం చేస్తోంది . అయితే పెళ్లి చేసుకుందామని ఝాన్సీ అడిగినప్పటికీ సూర్య లక్ష్య పెట్టకపోవడంతో తీవ్ర అవమానానికి గురై ఆత్మహత్య చేసుకుంది . ఝాన్సీ ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఝాన్సీ ఆత్మహత్య కు గల కారణాలను వెలికి తీయడం ప్రారంభించారు . పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత అసలు నిజాలు వెలుగులోకి రానున్నాయి .
English Title: TV artitste Jhansi commits suicide