బుల్లితెర నటి శ్రావణి ఇటీవల ఆత్మ హత్య చేసుకుని మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఆమె ఆకస్మిక మరణం వెనక నటుడు దేవరాజ్ వేధింపులే కారణమని ఆము కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ దేవరాజ్ మాత్రం శ్రావణి మృతికి తాను కారణం కాదని వాదిస్తున్నాడు. శ్రావణి మృతి నేపథ్యంలో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ ఈ రోజు ఎస్సార్ నగర్ పోలీసుల ఎదుట లంగిపోయారు.
ఈ విషయాన్ని స్వయంగా ఎస్సార్ నగర్ సీఐ నరసింహారెడ్డి వెల్లడించారు. పోలీసుల సూచనల మేరకు శ్రీకాకుళం నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చిన దేవరాజ్ ఎస్సార్ నగర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
అయితే ఈ కేసుతో తనకు సంబంధం లేదని, సాయికృష్ణాడ్డే ప్రధాన నిందుతుడని దేవరాజ్ ఆరోపిస్తున్నారు.
అయితే శ్రావణి కుటుంబ సభ్యులు మాత్రం గత కొంత కాలంగా శ్రావణిని దేవరాజ్ వేధిస్తున్నాడని ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా వుంటే శ్రావణితో కలిసి భోజనం చేసిన దేవరాజ్ సిసీ పుటేజీని పోలీసులు సేకరించి సీజ్ చేసినట్టు తెలిసింది. వీరిద్దరు కలిసి ఓ హోటల్లో భోజనం చేస్తున్న వీడియో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.