బాలీవుడ్లో డేటింగ్లు, లవ్స్టోరీలు, బ్రేకప్లు సర్వసాధారణమే. ఇప్పటి వరకు ఎన్నో జంటలు పీకల్లోతు ప్రేమలో మునిగి ఆ తరువాత బ్రేప్ చెప్పుకున్న సందర్భాలు ఎన్నో వున్నాయి. ఈ మధ్య డేట్కి వెళ్లడం ఫ్యాషన్గా మారిపోయింది. ఈ జాబితాలో హీరోయిన్ రాధికా ఆప్టే కూడా చేరింది. బోల్డ్ పాత్రల్లో కెమెరా ముందు ఎలాంటి బెరుకు లేకుండా నటించడానికి సిద్ధపడి బాలీవుడ్ కథానాయికలని కంగారెత్తించిన రాధికా ఆప్టే గత కొంత కాలంగా వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల టాలీవుడ్ హీరోలు, నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాధికా ఆప్టే కూడా డేట్ కి వెళ్లిందట.
తన డేట్కి సంబంధించిన సీక్రెట్ని తాజాఆ బయటపెట్టింది. అయితే ఒకే సారి తనని ఇద్దరు డేట్కి పిలిచారని చెప్పడం ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. తనని ఒకేసారి ఇద్దరు డేట్కి పిలిచారని ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదని చెబుతోంది రాధికా ఆప్టే. 2012లో లండన్కు చెందిన మ్యుజీషియన్ని పెళ్లాడిన రాధికా ఆప్టే తన పెళ్లికి ముందు జరిగిన ఆసక్తికర సంఘటనని తాజాగా గుర్తు చేసుకుంది. బెనడిక్ట్ని పెళ్లాడే సమయానికి ముందు ఇద్దరు తనని డేట్కి పిలిచారని, అయితే తనని డేట్కి పిలిచిన వాళ్లలో బెనెడిక్ట్ కూడా వున్నాడని, ఇద్దరిలో ఎవరితో డేట్కు వెళ్లాలో తెలియని సందిగ్ధంలో వున్న తను తన స్నేహితురాలి సహాయం తీసుకుని ఓ చిన్ని టెస్ట్ పెట్టుకున్నానని తెలిపింది.
తను వండిన టూనా చేపని పిల్లి తింటే బెనెడిక్ట్తో డేట్కి వెళ్లాలని లేకపోతే మరో వ్యక్తితో వెళ్లాలని నిర్ణయించుకున్నానని, తన అదృష్టం కొద్ది టూనా చేపని పిల్లి తిందని, దాంతో బెనెడిక్ట్తోనే తాను డేట్కి వెళ్లానని, తరువాత అతన్నే వివాహం చేసుకున్నానని తన డేట్ వెనకున్న అసలు సీక్రెట్ని ఈసందర్భంగా బయట పెట్టింది.