యావత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం kGF 2 . ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యాష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ మరో రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ చిత్ర యూనిట్ కు తీపి కబురు అందించింది. కేజీయఫ్ చాప్టర్-2 సినిమా టికెట్ ధరలను మూడు రోజుల పాటు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. టికెట్ పై రూ.50 పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.
దీంతో మల్టీఫ్లెక్స్లో టికెట్ రూ.50, సాధారణ థియేటర్లలో రూ.30 వరకు టికెట్ ధరలు పెరగనున్నాయి. ఈ నెల14 నుంచి 17 వరకు పెరిగిన ధరలు అమల్లో ఉండనున్నాయి. కేజీఎఫ్ సినిమా ఎంతటి సెన్సెషన్ క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దానికి రెట్టింపులా ఈ సెకండ్ పార్ట్ ఉండబోతుందని తాజాగా విడుదలైన ట్రైలర్ చెప్పకనే చెపుతుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.