ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కాగా వాటిలో మూడు నియోజకవర్గాల్లో మాత్రం కొండా దంపతుల ప్రభావం తీవ్రంగా ఉండనుంది దాంతో మూడు నియోజకవర్గాల్లో అధికార టీఆర్ ఎస్ పార్టీ ఓడిపోవడం ఖాయమైపోయింది . వరంగల్ ఈస్ట్ , భూపాలపల్లి , పరకాల అసెంబ్లీ స్థానాల్లో కొండా సురేఖ తో పాటు కొండా మురళి కి ప్రాబల్యం ఎక్కువగా ఉంది పైగా శాయంపేట నుండి వరుసగా పోటీచేసి గెలుపొందింది కూడా . అలాగే పరకాలలో కూడా పెద్ద ఎత్తున అనుచరవర్గం ఉంది కొండా దంపతులకు ఇక వరంగల్ ఈస్ట్ విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఇదే స్థానం నుండి పోటీచేసి గెలిచారు . అయితే ఈసారి మాత్రం కొండా సురేఖకు కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడంతో తిరుగుబాటు జెండా ఎగురవేసింది కొండా సురేఖ .
ఇప్పటికే రెండుసార్లు కేసీఆర్ పైన కేటీఆర్ పైన తీవ్ర విమర్శలు చేసిన కొండా దంపతులు త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు . రెండు స్థానాల్లో పోటీచేయాలని భావిస్తున్నారు అలాగే వరంగల్ ఈస్ట్ తో పాటుగా భూపాలపల్లి , పరకాలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలని కంకణం కట్టుకున్నారట కొండా దంపతులు . వాళ్ళు కనుక దృష్టి పెడితే ఆ మూడు స్థానాలు టీఆర్ఎస్ కోల్పోవడం ఖాయం . అంటే కేసీఆర్ , కేటీఆర్ ప్రకటించిన 100 స్థానాల్లో అప్పుడే 3 ఓడిపోతున్నారు , ఇక ఎన్నికల నాటికి ఎన్ని స్థానాలు దిగజారుతారో చూడాలి .
English Title: TRS will loose 3 seats in warangal dist