మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వరుస సినిమాలతో మళ్లీ స్పీడ్ చేసాడు. గతంలో ఓ సినిమాకు మరో సినిమాకు ఏడాది గ్యాప్ తీసుకునేవారు..కానీ ఇప్పుడు ఆలా కాదు ఓ సినిమా సెట్స్ పైకి ఉండగానే మరో సినిమాను లైన్లో పెడుతున్నాడు. రీసెంట్ గా భీమ్లా నాయక్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ చిత్రానికి మాటలు. స్క్రీన్ ప్లే అందించినప్పటికీ వెనుకాల మాత్రం అన్ని తానై చూసుకున్నాడు. ఇక ఇప్పుడు ఒకటి , రెండు కాదట ఏకంగా నాల్గు సినిమాలను లైన్లో పెట్టినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ మూవీ కి పూజా కార్య క్రమాలు పూర్తి చేసిన త్రివిక్రమ్..మహేష్ సర్కారు నుండి బయటకు రాగానే మొదలుపెట్టాలని చూస్తున్నాడు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ సినిమా పూర్తి చేయాలనీ చూస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా..దాని తర్వాత కుదిరితే పవన్ కళ్యాణ్ తో లేదంటే చరణ్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేసాడట. అలాగే అల్లు అర్జున్ తో మరో మూవీ చేసేందుకు కూడా రెడీ గా ఉన్నాడట. ఇలా వరుస పెట్టి సినిమాలు ఈ రెండేళ్లలో చేయాలనీ త్రివిక్రమ్ ప్రణాళిక సిద్ధం చేసాడట. మరి ఆయన ప్లాన్ ప్రకారం జరుగుతాయో లేదో చూడాలి.